Breaking News

అఫీషియల్: ఖిలాడికి కరోనా దెబ్బ! ఆ విషయంలో వెనక్కితగ్గిన రవితేజ


దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సినీ ఇండస్ట్రీపై ఆ మహమ్మారి ప్రభావం మరోసారి పడుతోంది. పలు సినిమాల షూటింగ్స్ అర్దాంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించబడిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి మాస్‌మహరాజ రవితేజా లేటెస్ట్ చిత్రం ‘ఖిలాడీ’ కూడా చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెనక్కి తగ్గారు. ఈ సినిమా విడుదలను వాయిదా వేయనున్నట్లు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమాగా రూపొందుతున్న 'ఖిలాడి` షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ కరోనా ఉధృతి త‌గ్గాక కొత్త రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమాలో సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీపై రవితేజ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


By May 05, 2021 at 01:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-khiladi-movie-post-poned-due-to-corona-effect/articleshow/82402212.cms

No comments