Breaking News

‘ఆయనను గౌరవించకపోవడం తీరని లోటు.. ఇప్పటికైనా అలా చేస్తే మంచిది’.. చిరు ట్వీట్ వైరల్


ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి.. ఎందరో నటీనటులకు మార్గదర్శకులుగా నిలిచిన వ్యక్తి దర్శకరత్న . ఆయన తెలుగు ప్రజలు ఎప్పుటికీ మర్చిపోని ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. ఎందరికో గురువు స్థానంలో ఉండి.. ఇండస్ట్రీలో ఓనమాలు దిద్దించారు. ఆయన డైరక్షన్‌లో వచ్చిన సినిమాలు దాదాపు అన్ని బ్లాక్‌బస్టర్‌లే. దర్శకుడిగా మాత్రమే కాక.. ప్రొడ్యూసర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, నటుడిగా ఆయన పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. తెలుగువాడి సత్తాను బాలీవుడ్‌లోనూ చాటిన దర్శకుడు దాసరి నారాయణ రావు. నేడు (మే 4న) దాసరి 74వ జయంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, పెద్దలు ఆయనకు స్మృత్యాంజలలు అర్పిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాసరితో తమకున్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చేసిన ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా నిలిచింది. దాసరికి కేంద్ర ప్రభుత్వం తగినంత గుర్తింపు ఇవ్వలేదని.. ఇప్పటికేనా ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని చిరు ట్వీట్ చేశారు. దాసరి, చిరు కాంబినేషన్‌లో రూపొందిన ‘హిట్లర్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ‘‘దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒక దానికి మించిన మరో చిత్రాలని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యలని పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే. శ్రీ దాసరి గారికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకి పోస్త్యుమన్‌గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుంది’’ అంటూ చిరు ట్వీట్ చేశారు. మరి దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


By May 04, 2021 at 02:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dasari-narayana-rao-should-get-padma-award-says-chiranjeevi/articleshow/82385946.cms

No comments