Breaking News

‘నాలుగు రోజుల్లో అంతు చూస్తాం’.. యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు


ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపుతామంటూ తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ఏప్రిల్ 29వ తేదీన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Also Read: సంచలన నిర్ణయాలతో దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్‌, నవంబర్, డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. నవంబర్‌లో యూపీ పోలీస్ 112 హెల్ప్‌లైన్‌కు 15 ఏళ్ల బాలుడు బెదిరింపు మెసేజ్ పంపించాడు.. మొబైల్ నెంబర్ ఆధారంగా అతడిని ఆగ్రాలో అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు పంపారు. కోవిడ్ నేపథ్యంలో స్కూళ్లు మూసేరన్న కోపంతోనే అతడు బెదరింపు మెసేజ్ పంపినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. Also Read:


By May 04, 2021 at 02:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-cm-yogi-adityanath-gets-death-threat-you-have-four-days-warns-whatsapp-message/articleshow/82385508.cms

No comments