Breaking News

ఇదేం విడ్డూరం... కేజీ బంగారంతో భార్యకు మంగళసూత్రం, అసలు విషయం తెలిసి అవాక్కు


పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో.. 5 తులాలో.. మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాలబంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కేజీ బంగారంతో తయారుచేయించిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. దాన్ని ఆ మహిళ మెడలో ధరించి వీడియో తీసుకోగా.. అది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారుచేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ల వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాకయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా వారు కూడా అదే చెప్పడంతో పోలీసులు బాలాను విడిచిపెట్టారు. ‘ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అధికంగా బంగారాన్ని కలిగి ఉండటం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడమంటే దొంగలకు వెల్‌కమ్ చెప్పడమే. అందుకే బాలాను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించాం. అది నకిలీ బంగారమని చెప్పాడు. సదరు షాపులో ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది’ అని పోలీసులు తెలిపారు.


By May 25, 2021 at 01:59PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bhiwandi-woman-wearing-1-kg-gold-mangalsutra-video-goes-viral/articleshow/82935144.cms

No comments