Breaking News

Techie Suicide: బయటికెళ్తున్నానని చెప్పి.. బావిలో దూకిన భర్త


బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడు సొంతూరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో జరిగింది. శింగనమల పరిధిలోని యెల్లనూరు మండలం వెన్నపూసపల్లికి చెందిన జగన్‌మోహన్ రెడ్డి కుమారుడు లోకేశ్వర్‌రెడ్డి(24) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో కౌసల్య అనే యువతితో వివాహమైంది. వివాహానంతరం బెంగళూరులో కాపురం పెట్టారు. రెండురోజుల కిందట మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చిన లోకేశ్వర్ రెడ్డి రాత్రి 8 గంటలకు సొంతూరు వెన్నపూసపల్లికి చేరుకున్నాడు. సరాసరి తోట వద్దకు చేరుకుని బైక్ పక్కన పెట్టాడు. తన తల్లిదండ్రులు, భార్యని బాగా చూసుకోవాలంటూ తన బంధువులకు వాయిస్ మెసేజ్‌లు పెట్టాడు. అది విన్న బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనగా తోట వద్దకు వచ్చి వెతికారు. తోటలోని బావి వద్ద లోకేశ్వర్ రెడ్డి పర్సు లభించడంతో అందులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించి నీటిని తోడేయడంతో లోకేశ్వర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పర్యవేక్షించారు. అయితే లోకేశ్వర్ రెడ్డి ఆత్మహత్య గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పెళ్లైన ఏడాదికే భర్త మరణంతో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. Also Read:


By November 14, 2020 at 02:17PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/software-engineer-commits-suicide-in-anantapur/articleshow/79222120.cms

No comments