Breaking News

వరలక్ష్మిని చంపింది అందుకే.. అసలు విషయం బయటపెట్టిన అఖిల్


విశాఖలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. మాట్లాడుదామని పిలిచి వరలక్ష్మీని అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు అఖిల్. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఖిల్ సాయితో ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసిందని పోలీసులు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు బ్రేకప్ చెప్పగానే ఆమెను హత్య చేయాలని అఖిల్ సిద్దమైనట్లు తెలిసింది. తనకు దూరమైన వరలక్ష్మి మరెవరికీ దక్కకూడదనే కోపంతోనే అత్యంత దారుణంగా ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావించారు. అయితే అదే నిజమని అఖిల్ కూడా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. వరలక్ష్మి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అఖిల్ పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడించాడు. ఘటన స్థలంలో దొరికిన నల్లటి వస్త్రం వరలక్ష్మిదే నని పేర్కొన్నాడు అఖిల్. ఘటనా స్థలంలో ఆమె పక్కనే నిమ్మకాయలు, పసుపు ఆ పక్కనే ఈ నల్లటి వస్త్రం దొరకడంతో చేతబడి పూజలు ఏమైనా జరిగియా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. Read More: అయితే వరలక్ష్మీని హత్య చేసేందుకు ముందుగానే కారం బ్లేడు తానే కొన్నానని అఖిల్ తెలిపాడు. వరలక్ష్మీతో మాట్లాడాలని సాయిబాబా గుడివద్దకు ఆమెను ఫోన్ చేసి పిలిచాడు అఖిల్. అయితే వారు అక్కడకు చేరుకునే సరికి ఎవరో అక్కడ పూజలు చేశారని పేర్కొన్నారు. తనను కాదని మరో వ్యక్తికి దగ్గరవుతున్నందుకే చంపానని అఖిల్ ఒప్పుకున్నాడు. అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖ దీక్ష ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.


By November 14, 2020 at 02:22PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-vijayalakshmi-murder-case-accused-akhil-sensational-comments/articleshow/79222070.cms

No comments