Breaking News

అల్లు అరవింద్‌పై అల్లు అర్జున్ కామెంట్స్.. మా ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే విషయమంటూ ఎమోషనల్ ట్వీట్


తెలుగు సినీ పరిశ్రమలో అల్లు ఫ్యామిలీది సుదీర్ఘ ప్రస్థానం. ఆ రోజుల్లోనే వెండితెరపై అల్లు రామలింగయ్య చూపిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. ఆ తర్వాత అల్లు అరవింద్ నిర్మాతగా సత్తా చాటుతూ ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. ఇక ఇప్పుడు అల్లు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ , అల్లు శిరీష్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచిస్తూ ప్రేక్షకులకు చేరువవుతూ వస్తోంది టోటల్ అల్లు ఫ్యామిలీ. ఈ క్రమంలోనే 'ఆహా' పేరుతో ఓటీటీ వేదిక ప్రారంభించారు. దీపావళి సందర్భంగా ఈ 'ఆహా' ఓటీటీ తరఫున హైదరాబాద్‌లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ హాజరు కాగా.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తన తండ్రి అల్లు అరవింద్‌పై ప్రశంసలు గుప్పించారు. పూర్తిగా తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న 'ఆహా' వేదిక తెలుగు ప్రేక్షకులకు బెటర్ ఛాయిస్ అవుతుందని అన్నారు. Also Read: ఇకపోతే ఈ కార్యక్రమ విశేషాలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అల్లు అర్జున్.. ''తెలుగు ఓటీటీకి గ్రాండ్ ఫాదర్‌గా నిలిచిన మా నాన్న అల్లు అరవింద్ ‌గారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అల్లు కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అద్భుతమైన ఈవెంట్ ఇది. ఆహా బృందం మొత్తానికి శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇందులో అల్లు అర్జున్ మాసిన గడ్డంతో మాస్ లుక్‌లో కనిపించనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. Also Read:


By November 15, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-comments-on-allu-aravind-at-aha-special-event/articleshow/79228596.cms

No comments