Breaking News

ఎస్ఐల ఫోటోలతో నెటిజన్లకు బ్లాక్‌మెయిల్.. ‘ప్రకాశం’ పోలీసు శాఖలో కలకలం


సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్స్‌గా పోలీసులు ఫోటోలు పెట్టుకుని ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నయా దందా ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అద్దంకి ఎస్సై వెలగా మహేష్‌ ఫోటోతో ఉన్న అకౌంట్‌ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వాటిని ఆమోదించిన తర్వాత కొందరికి డబ్బులు పంపాలంటూ మెసేజ్‌లు వచ్చాయి. వీటిలో కొన్ని ఎస్ఐ స్నేహితులకు కూడా రావడంతో వారు వెంటనే ఆయనకు విషయం చెప్పారు. దీంతో అప్రమత్తమైన ఎస్ఐ మహేష్ తన పేస్‌బుక్ మిత్రులను అప్రమత్తం చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. Also Read: అద్దంకి ఎస్ఐ మహేష్‌ ఫొటోతో ఓ వ్యక్తి ఇటీవల ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఎస్ఐ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్న పలువురితో అతను ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా చాటింగ్‌ చేస్తున్నాడు. పరిచయం పెరిగాక తనకు అత్యవసరంగా రూ.10 వేలు కావాలంటూ డిమాండ్ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంటనే అప్రమత్తమై ఫేస్‌బుక్‌లో తన లైవ్‌ వీడియో అప్‌లోడ్‌ చేశారు. తన పేరుతో పరిచయం లేని వ్యక్తి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అతడ్ని ఎవరూ నమ్మవద్దని, అది తన అకౌంట్ కాదని తన స్నేహితులను అప్రమత్తత చేశారు. Also Read: అనంతరం ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టి విచారణ చేయడం ప్రారంభించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి తన ఒక్కడి ఫోటోనే కాకుండా నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎస్ఐల ఫోటోలతోనూ అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో ఎస్ఐ మహేష్ ఆ ఇద్దరు ఎస్‌ఐలతో పాటు శాఖలో తనకు పరిచయం ఉన్న మరికొందరు అధికారులను అప్రమత్తం చేశారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ఈ దందాపై పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. Also Read:


By September 04, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/unidentified-man-blackmails-to-facebook-friends-with-si-photos/articleshow/77923448.cms

No comments