Breaking News

శ్రీకాకుళం: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఏడాదికే విగతజీవిగా మారి


పెద్దలను ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లాడిన యువతి ఏడాది తిరగకముందే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన జిల్లాలో జరిగింది. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన బగాది శిరీష (22), ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామానికి చెందిన బోనెల హేమసుందరరావును ప్రేమించింది. వీరి ప్రేమకు శిరీష తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లాడింది. వీరి వివాహాన్ని పొందూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేసుకున్నారు. Also Read: ప్రస్తుతం ఈ దంపతులు పెయ్యలవానిపేటలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం శిరీష ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే తమ కూతురిని భర్త, అత్తమామలే చంపేశారని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరకట్నం కోసం ఆరు నెలలుగా శిరీషను చిత్రహింసలు పెడుతున్నారని, అత్తింట్లో పడుతున్న బాధలను తమ కూతురు ఫోన్లో చెప్పి బాధపడేదని చెబుతున్నారు. దీనిపై శిరీష తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 04, 2020 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-srikakulam-district-parents-allegations-on-husband/articleshow/77923297.cms

No comments