Breaking News

కుల్‌భూషణ్ కేసు: మరోసారి భారత్‌కు అవకాశం ఇవ్వండి.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం


భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌ కేసులో మరోసారి పాక్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. గురువారం నాటి విచారణ సందర్భంగా కుల్‌భూషణ్ తరఫున లాయర్‌ను నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలుకు జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించే పిటిషన్‌పై విచారణ జరిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు పాకిస్థాన్‌.. భారత్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను జారీ చేసిందని ఆ దేశ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు. అంతేకాదు, జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదనకు భారత్‌ ఇంత వరకూ స్పందించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు విన్న ఇస్లామాబాద్‌ హైకోర్టు తమ ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాక్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్‌ మిలటరీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కుల్‌భూషణ్ జాదవ్ రక్షణ విషయంలో పాక్‌తో దౌత్య, ప్రభుత్వ పరమైన చర్చల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. జాదవ్ భద్రత విషయంలో అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. జాదవ్ తరఫున భారతీయ లాయర్‌ను నియమించే అవకాశం ఇవ్వాలని గత నెలలో కేంద్రం కోరింది. ‘అయితే, పాకిస్తాన్ ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రధాన సమస్యలో ఒకటైన ఈ కేసులో అవసరమైన అన్ని పత్రాలను అందించడం సహా జాదవ్‌ కేసులో కాన్సులర్ యాక్సెస్‌కు అంగీకరించాలి’ అని శ్రీవాస్తవ్ అన్నారు. పాకిస్థాన్ బేషరతుగా కాన్సులర్ యాక్సెస్ కోసం ఏర్పాటు చేయాలని భారత్ నొక్కిచెప్పింది. ప్రతీకారాన్ని పక్కనబెట్టి జాదవ్ ఉన్న చోట ఏ పాకిస్తాన్ అధికారి హాజరుకాకుండా ఈ సమావేశాన్ని జరిగేలా చూడాలని కోరారు.


By September 04, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/government-taking-all-steps-to-ensure-safety-of-kulbhushan-jadhav-mea/articleshow/77923583.cms

No comments