Breaking News

సైరా దర్శకుడి తర్వాతి చిత్రం పవర్ స్టార్ తోనే..?


మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత ఆ దర్శకుడి నెక్ట్ చిత్రంపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బిజీగా ఉండడంతో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉంటుందనే విషయమై అనేక వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో సినిమా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు.

వకీల్ సాబ్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష, హరీష్ శంకర్ తో మరో సినిమా.. ఇలా వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాతి చిత్రాన్ని సురేందర్ రెడ్డితో చేయడానికి సిద్ధం అయ్యాడట. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడట. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్లో మంచి బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా రూపొందనుందని వినబడుతోంది.

ఈ విషయమై అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో వెలువడనుందట. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబరు 2వ తేదీన ఈ సినిమాపై అప్డేట్ రానుందని అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరగనుందో..!



By August 31, 2020 at 12:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52391/surender-reddy.html

No comments