Breaking News

మార్కాపురం: కళ్లలో కారం కొట్టి భర్త హత్య.. ప్రియుడితో కలిసి బైక్‌పై పరార్


అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తాళి కట్టిన భర్తనే ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపేసిందో కిరాతకురాలు. ఈ దారుణ ఘటన జిల్లా మార్కాపురం పట్టణంలో జరిగింది. కడప జిల్లాకు చెందిన యల్లయ్యగారి వెంకటేశ్వర్లు(32) ఉపాధి నిమిత్తం 2011లో మార్కాపురానికి వలస వచ్చాడు. 2013లో గుంటూరు జిల్లా కొచ్చెర్లకు చెందిన అశ్విని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆదికేశవ్‌(6), రుషికేశవ్‌(3) అనే ఇద్దరు పిల్లలున్నారు. వెంకటేశ్వర్లు చికెన్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే అశ్వినికి అదే ప్రాంతానికి చెందిన తంగిరాల దేవరాజ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దేవరాజ్ భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో వీరి రాసలీలలు మరింత శ్రుతిమించాయి. అశ్విని పిల్లలను ఇంట్లోనే ఉంచి తరుచూ దేవరాజ్‌ ఇంటికి వెళ్లి అతడితో సెక్స్‌లో పాల్గొనేది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు పద్ధతి మార్చుకోవాలని భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని అశ్విని నిర్ణయించుకుంది. Also Read: ఈ క్రమంలోనే శుక్రవారం ఓ విషయమై చర్చించాలని వెంకటేశ్వర్లును నమ్మించిన అశ్విని తన ప్రియుడు దేవరాజ్ ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికే సిద్ధంగా ఉన్న దేవరాజ్.. వెంకటేశ్వర్లు కళ్లల్లో కారం కొట్టి, ఇనుప రాడ్‌తో తలపై కొట్టి దారుణంగా చంపేశాడు. తర్వాత దేవరాజ్, అశ్విని కలిసి బైక్‌పై పరారయ్యారు. వెంకటేశ్వర్లు తల్లి జీవనమ్మ ఇచ్చి ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించారు. Also Read:


By August 30, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-help-of-boyfriend-in-prakasam-district/articleshow/77830378.cms

No comments