Breaking News

హైదరాబాద్: అత్యాచారం కేసులో కాంట్రాక్టర్‌కు పదేళ్ల జైలు


మహిళను బెదిరించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన కాంట్రాక్టర్‌ను పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లికి చెందిన గట్టు రాజేందర్‌ అలియాస్‌ రాజు వాస్తు రాజు(47) సివిల్‌ కాంట్రాక్టర్‌‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసించే ఓ మహిళపై కన్నేసిన అతడు 2012 అక్టోబర్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. Also Read: దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ కేసును ఎనిమిదేళ్ల పాటు విచారించిన నాంపల్లిలోని 11వ అడిషనల్ మెట్రోపాలిటన్‌ సెషన్‌ కోర్టు రాజేందర్‌‌ను దోషిగా నిర్ధారించింది. దీంతో అతడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. Also Read:


By August 06, 2020 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/civil-contractor-gets-10-yr-jail-for-raping-woman-in-hyderabad/articleshow/77384513.cms

No comments