చేపల కూర వండలేదని... 9 నెలల గర్భిణిని కొట్టి చంపిన భర్త
మద్యం మత్తులో రాక్షసుడిగా మారిన ఓ వ్యక్తి నిండు గర్భిణి అయిన భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన ఒడిశాలోని బొలంగీర్ పట్టణం రాధరాణిపడ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. మోతీలాల్ బారిక్ అనే వ్యక్తికి అనాదిని(25) అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల మోతీలాల్ మద్యానికి బానిసై భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. తొమ్మిదో నెల రావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. Also Read: మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మోతీలాల్ చేపల కూర వండలేదని భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో భార్య తలపై కర్రతో కొట్టి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అనాదిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మోతీలాల్పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు. Also Read:
By August 06, 2020 at 09:57AM
No comments