Breaking News

పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి 20 మందికి గాయాలు


అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లోని ఓ పార్టీలో జరిగిన గొడవ కాల్పులుకు దారి తీసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులపై ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొడవ అర్ధరాత్రి 12.30గం.లకు జరిగింది. గాయపడ్డ వారిలో 11 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 17 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ముగ్గురు కాల్పులుకు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాత్రి జరిగిన ఈ పార్టీకి సుమారు 400 మంది హాజరయ్యారని అన్నారు. కరోనా నేపథ్యంలో 50మందికి మించి ఒక ప్రదేశంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నా.. ఇంత పెద్దగా పార్టీ నిర్వహించడం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌ లాగిస్తూ.. మ్యూజిక్‌ వింటూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు కాల్పుల ఘటన గురించి చెబుతూ.. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్‌ఫైరింగ్‌ శబ్దాలు వినిపించాయన్నారు. అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని తెలిపారు. మరికొంత మంది భయంతో కార్ల కింద దాక్కొన్నారన్నారు. మరోవైపు ఈ ఘటనలోఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు పోలీసులు. కాల్పుల టనపై కేసు నమోదు చేయగా.. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేశారు.


By August 11, 2020 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/one-killed-20-wounded-in-washington-d-c-shooting/articleshow/77476423.cms

No comments