Breaking News

నాలుగేళ్లుగా డ్రైవర్‌తో అఫైర్.. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికెళ్లి శృంగారం, చివరికి


భర్త చనిపోవడంతో బిడ్డతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు డీసీఎం డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ బంధానికి ప్రియుడే చరమగీతం పాడుతూ ఆమెను కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి జరిగి మహిళ హత్యకేసు వివరాలిలా ఉన్నాయి. నాచారంలోని బాబానగర్‌కు చెందిన రేణుక(30) కూరగాయలు అమ్ముడూ కుటుంబాన్ని పోషిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం మూసిపట్టల్‌కు చెందిన అంజయ్య డీసీఎం డ్రైవర్‌. చిలుకానగర్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. Also Read: నాలుగేళ్ల క్రితం రేణుకకు అంజయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాది క్రితం రేణుక భర్త చనిపోవడంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అంజయ్య తరుచూ ఆమె ఇంటికి వచ్చిన లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఇటీవల అంజయ్య భార్య, పిల్లలు ఊరెళ్లడంతో ఆదివారం రాత్రి రేణుకను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ మద్యం తాగిన తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. Also Read: అనంతరం రేణుక తన అవసరాల కోసం అతడిని డబ్బులు అడగడంతో గొడవ మొదలైంది. మాటామాటా పెరగడంతో ఆవేశానికి గురైన అంజయ్య బీరు సీసాతో ఆమె తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రేణుక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉప్పల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఏడాది క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి చనిపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడు అనాథగా మారాడు. Also Read:


By August 11, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-married-woman-illegal-affair-with-driver-and-murdered-by-him/articleshow/77476539.cms

No comments