Breaking News

నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన చెరువు.. అందరిదీ ఒకే కుటుంబం


ఒడిశాలోని ఢెంకనాల్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం గోవిందపూర్‌ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విషాదకరం. గోవిందపూర్‌ గ్రామానికి చెందిన జితేంద్రకుమార్‌ బెహర తన ఇద్దరు సోదరుల కుటుంబాలతో కలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములకు చెందిన పిల్లలు నిషాల్‌(8), రాజేష్‌(9), ప్రీతిబాల(13), తృప్తిమయ(16) సోమవారం ఉదయం ఇంట్లో కాసేపు చదువుకుని అనంతరం గ్రామ శివారులోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. Also Read: పిల్లలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళనపడిన కుటుంబసభ్యులు వారి కోసం చెరువు వద్దకు వెళ్లి గాలించారు. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో తిరిగి వెళ్తున్న సమయంలో చెరువులో ఓ బాలిక మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు గ్రామస్థుల సాయంతో చెరువులో గాలించిగా నలుగురు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read: సమాచారం అందుకున్న జిల్లా ఉపకలెక్టర్‌ ఎస్‌.ఎం.ప్రధాన్‌, ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలకు తాత్కాలిక సాయంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టానికి చేయించారు. అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు చిన్నారులకు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటివరకు తమ కళ్లెదుటే ఆడుతూపాడుతూ కనిపించిన నలుగురు పిల్లలు విగతజీవులుగా మారడంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:


By June 02, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-child-of-single-family-drowned-to-death-in-pond-in-odisha/articleshow/76147542.cms

No comments