Breaking News

విజయనగరంలో విషాదం.. సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కి యువకుడు మృతి


సెల్ఫీలు అనేక మంది ప్రాణాల్ని బలితీస్తున్నాయి. సెల్ఫీ తీసుకునే మోజులో పడి అనేకమంది తమ ముందున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో యువత ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీ కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ దిగే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ప్రతాప్ అనే యువకుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. లాక్ డౌన్‌తో ఇంటి వద్దనే ఉంటున్న ప్రతాప్ ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లాడు. రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లిన ప్రతాప్ అక్కడ ఆగి ఉన్న తీసుకోవాలని భావించాడు. గూడ్సు రైలు ఎక్కిన ప్రతాప్ సెల్ఫీ తీసుకునే ప్రయత్పం చేశాడు. అయితే రైల్వే విద్యుత్ లైన్ హైవోల్టేజ్ సెల్ ఫోన్ కు ప్రవహించడంతో షాక్ తగిలి ప్రతాప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రతాప్ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు ఊరిలో కూడా ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెల్ ఫోన్ మోజులో, సెల్ఫీల మోజులో పడి యువకులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ పలువురు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


By June 03, 2020 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-died-while-taking-selfie-on-goods-train-at-vizianagaram/articleshow/76167518.cms

No comments