Breaking News

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చించి. ఆయన ఉంటున్న ఇంటికి, సచివాలయానికి బాంబు ఉందంటూ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సీఎం ఇంట్లోనే బాంబ్ ఉందంటూ ఫోన్ రావడంతో పోలీసులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. తరువాత ఓ ఆకతాయి కుర్రాడు కావాలని ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడని తెలిసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌తో ఎందుకైనా మంచిదని సీఎం ఇంటికి, సచివాలయానికి భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం ఉంటున్నారు. మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో తమిళనాడు రాష్ట్ర సచివాలయం ఉంది. ఈ రెండింటికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డా గ్‌ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం పోలీసులు బాంబు కాల్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఎక్కడ్నుంచి యువకుడు కాల్ చేశాడన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. ట్రాక్ చేసి కల్ వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే గతంలో కూడా తమిళనాడు సీఎంకు ఇలాంటి బాంబు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా ఇలాంటి ఫేక్ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో రజనీ కాంత్ ఇంట్లో అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు.


By June 03, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bomb-threat-phone-call-to-tamil-nadu-cm-palanisamy-house/articleshow/76168909.cms

No comments