Breaking News

కీచక పోలీస్.. అర్ధరాత్రి ఒంటరి మహిళపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం


ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతాయుత పోలీసు ఉద్యోగం ఉన్న వ్యక్తి కీచకుడిగా మారాడు. అర్ధరాత్రి సాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వివాహితను మార్గమధ్యలో అడ్డగించి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన రాజధాని భువనేశ్వర్‌లో సంచలనం రేపింది. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక పీఎస్‌కు కాలినడకన బయలుదేరింది. మార్గమధ్యంలో స్నేహితుడితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓఎస్‌ఏపీ కానిస్టేబుల్‌ దశరథ్‌ నాయక్‌ ఆమెను ఆపి విషయం తెలుసుకున్నాడు. Also Read: తాను సాయం చేస్తానని నమ్మించిన దశరథ్ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఆటోలోనే అనేక ప్రాంతాలు తిప్పుడూ చివరికి సహిద్‌నగర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ తన ఫ్రెండ్‌తో కలిసి వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కానిస్టేబుల్, అతడి ఫ్రెండ్, ఆటోడ్రైవర్‌ను పట్టుకుని పోలీసులను అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీసీ అనూప్‌కుమార్ సాహు ఈ ఘటనపై ఆరా తీశారు. Also Read:


By June 03, 2020 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-conistable-arrested-in-odisha-over-rape-attempt-on-married-woman/articleshow/76169563.cms

No comments