Breaking News

సచివాలయంలో కరోనా కలకలం.. 8మందికి పాజిటివ్


దేశ వ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో పలువురు సెక్రటేరియట్ ఉద్యోగులకు వైరస్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని సచివాలయం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. సెయింట్‌ జార్జి కోట ప్రాంగణంలోని సచివాలయానికి 'కరోనా' షాక్‌ తగిలింది. పలు విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగుల రక్తనమూనాలను పరీక్షించగా పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. 70 రోజుల అనంతరం లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కార్యాలయాల్లో ప్రస్తుతం 50 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. సిబ్బంది పనిచేసని కార్యాలయాల్లో భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కావడంతో ఉద్యోగుల హాజరు 33 శాతానికి తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి సచివాలయ ఉద్యోగుల సంఘం మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తమిళనాడులో దాదాపు 200కు పైగా మంది మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరాఖండ్‌లో ఓ మంత్రి కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడింది. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కూడా కరోనా వైరస్ సోకింది. కరోనా కోసం శ్రమిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సైతం వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8,909 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2.7 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి


By June 03, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/secretariat-employees-in-chennai-having-tested-positive-for-covid-19/articleshow/76168487.cms

No comments