Breaking News

4వ తరగతి చిన్నారిపై టీచర్ రేప్.. బాలికకు రక్తస్రావం.. చితక్కొట్టిన గ్రామస్థులు


నాలుగో తరగతి బాలికల పట్ల లైంగిక చర్యలకు పాల్పడుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని గ్రామస్థులు చితక్కొట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే కామాంధుడు గత మూడు సంవత్సరాలుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశం సాధించేందుకు 4వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తుంటాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికలు సందేహాలడుగుతుంటే అక్కడికక్కడ చెప్పకుండా తన ఇంటికి రమ్మని కోరేవాడు. ఇంట్లో లేకుండా చూసుకొని చిన్న పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదరగొట్టేవాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆ కామాంధుడి వద్దకు వెళ్లిన బాలిక తన ఇంటి వద్ద స్నానం చేస్తుండగా రక్తస్రావం అయింది. అది చూసిన తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. ఆశ్చర్యపోయిన తల్లి పాపను ప్రశ్నించగా మొత్తం విషయం చెప్పింది. పిల్లలను శరత్ కుమార్ ఇంటికి ఎందుకు పంపుతుండడం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. గురువారం ఉపాధ్యాయుడి కోసం గాలింపు చేపట్టారు. కొల్లాపూర్ వెళ్లాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లి పట్టుకుని తీసుకువచ్చారు. గ్రామస్థులతా కలిసి ప్రశ్నించగా మద్యం మత్తులో తప్పుచేశానని శరత్ కుమార్ అంగీకరించాడు. అందరూ కలిసి అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నాడు. మరి కొందరు బాలికలపైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


By March 06, 2020 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/teacher-rapes-4th-class-girl-in-wanaparthy-district/articleshow/74504441.cms

No comments