‘సమత’ గ్యాంగ్రేప్ ఘటనలో సంచలన విషయాలు.. 3 నెలలుగా రెక్కీ చేసి

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘దిశ’ ఘటన కంటే కొద్దిరోజుల ముందు తెలంగాణలో జరిగిన ‘సమత’ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్లో ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. Also Read: ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాబొద్దీన్ గతంలోనూ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ2 షేక్బాబును భార్య వదిలేయడంతో గ్రామంలో జులాయిగా తిరిగేవాడని, , ఏ3 షేక్ ముక్దుం చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చాడని తెలుస్తోంది. వీరు ముగ్గురూ ముఠాగా ఏర్పడి అడవిలో కలప నరికి స్మగ్లింగ్ చేసేవారని స్థానికులు చెబుతున్నారు. షాబొద్దీన్ గతంలో కోలాంగూడలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేయగా స్థానికులు దేహశుద్ధి చేసి, గ్రామం నుంచి తరిమేశారు. Also Read: తర్వాత ఎల్లాపటార్కు మకాం మార్చిన అతడు వివాహితను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అనేక దారుణాలకు పాల్పడిన ఈ ముగ్గురు కామాంధులు 3 నెలలుగా సమత దంపతుల కదలికలను గమనిస్తూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే నవంబర్ 24న ఎల్లాపటార్ శివారులో మాటువేసి సమతను పొదల్లోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కేకలు సమీపంలోని రైతు కూలీలకు వినిపించినా ఏదో భార్యభర్తల గొడవ అనుకుని వారు పట్టించుకోనట్లు తెలిసింది. Also Read:
By December 10, 2019 at 10:32AM
No comments