చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. ‘సీన్ రీకన్స్ట్రక్షన్’ చేసిన పోలీసులు

జిల్లా కురబలకోట మండలం చేనేతనగర్ సమీపంలోని కల్యాణ మండపం సమీపంలో గతనెల 8న దారుణహత్యకు గురైన చిన్నారి (6) హత్యకేసులో పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. డీఎస్పీ రవి మనోహరాచారి వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రి డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి హత్య కేసులో సాధ్యమైనంత వరకు నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. Also Read: నిందితుడు రఫీని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్ఎస్ఎఫ్ఎల్ నివేదిక కూడా వచ్చిందని, దానికి సంబంధించి వైద్యుల సలహాలు తీసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై బలమైన ఆధారాలు సేకరించామన్నారు. అన్ని ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు వచ్చేలా చేస్తామన్నారు. Also Read: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి నవంబర్ నెలలో చేనేతనగర్లోని కల్యాణ మండపంలో పెళ్లికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు లారీ క్లీనర్గా పనిచేసే మదనపల్లె మండలం బసినికొండకు చెందిన రఫీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. Also Read:
By December 10, 2019 at 11:04AM
No comments