ఇరాక్: ప్రధానికి వ్యతిరేకంగా ఆందోళనలు.. కాల్పుల్లో 25 మంది మృతి

ఇరాక్లో జరిగిన అల్లర్లలో 25 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 130 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బాగ్దాద్తోపాటు నసీరియాహ్ నగరంలో ఆందోళనకారులుపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల్లో 12 మంది నిరసనకారులు మరణించారు. నసీరియాహ్ నగరంలో జరిగిన అల్లర్లలో 25 మంది మరణించారు. నిరసన కారుల ఆందోళనలతో నసీరియాహ్ నగరంలో కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్ల సందర్భంగా ఇరాక్ లో 47 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఇరాక్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మోఖ్తదా అల్సాదర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఓ భవనంలో ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. తర్వాత మోఖ్తదా ఇంటిపై కూడా డ్రోన్ సాయంతో బాంబు దాడిచేశారు. ఈ ఘటనల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులు క్రిమినల్ గ్యాంగ్స్ పనేనంటూ ఇరాక్ అధ్యక్షుడు ప్రకటించడం గమనార్హం. ఆందోళనకారులపై దాడిజరిగిన కొద్ది గంటల్లోనే మోఖ్తదా ఇంటిపై బాంబులు వేశారు. గత రెండు నెలలుగా ఇరాక్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. అక్టోబరు 5న ఆందోళనకారులు, సైనికులు మధ్య జరిగిన ఘర్షణలో 60 మంది ప్రాణాలు కోల్పోగా, నవంబరు 29 నాటి ఘటనలో మరో 45 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్దాద్ నగరాల్లో అల్లర్లు హెచ్చుమీరాయి. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల సమావేశాలను బహిష్కరిస్తారని ప్రకటించారు.
By December 08, 2019 at 01:12PM
No comments