Breaking News

‘పశ్చిమ’లో చేతబడి చేసిందంటూ మహిళను చంపిన సైకో..! జనాలు ఏం చేశారంటే?


తనకు చేతబడి చేసిందనే అనుమానంతో ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో సైకో! చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుతు తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు గల్లా శ్రీనివాసరావు కొంత కాలంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం రెండు రోజుల క్రితమే అతడు పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. తనకు ఎవరో చేతబడి చేయించారని.. దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోనని గ్రామంలో హల్‌చల్‌ చేసేవాడు. చేతబడి వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు చెప్పుకునేవాడు. ఈ నేపథ్యంలో చింతలపూడికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి చెప్పిన మాటలు ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన పాలేటి సత్యవతి (52) తనకు చేతబడి చేయించిందని శ్రీనివాసరావు నమ్మాడు. Also Read: చంపేసి.. జనాలను బెదిరించి.. సత్యవతి శనివారం ఉదయాన్నే గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఎదురింట్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇనుపరాడ్‌తో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సత్యవతిని చూసిన కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకొన్నారు. ఎవరైనా దగ్గరకు వస్తే పెట్రోల్ పోసి చంపేస్తానని అక్కడే నిలుచొని ఉన్న నిందితుడు శ్రీనివాసరావు బెదిరించాడు. దీంతో సత్యవతి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ పి.రాజేష్‌, ఎస్సై క్రాంతికుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Also Read: నిందితుడిని అప్పగించాలని బైఠాయింపుసత్యవతి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతదేహం వద్ద దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారికి సర్దిచెప్పి ఎట్టకేలకు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. Also Read:


By December 08, 2019 at 01:30PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chintalapudi-psycho-kills-woman-over-doubt-of-sorcery/articleshow/72423983.cms

No comments