Breaking News

ప్రేమించి పెళ్లి చేసుకుని... మోజు తీరాక గెంటేశాడు


ప్రేమిస్తున్నానంటూ బంధువుల అమ్మాయి వెంట పడి పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లిని చేశాక ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట మండలంలోని దొండపాడుకు చెందిన పుష్పకు చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు. అనారోగ్యంతో తల్లి లేవలేని స్థితిలో ఉండటంతో ఆమే కుటుంబాన్ని పోషిస్తోంది. ముప్పాళ్ల మండలంలోని లంకెలకూరపాడుకు చెందిన కట్టా ప్రసాద్ అనే యువకుడు పుష్పకు సమీప బంధువు. Also Read: రెండేళ్ల క్రితం ప్రేమిస్తున్నాంటూ పుష్పను నమ్మించి, కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల పాప ఉంది. ఇటీవల భర్తతో పాటు అత్తమామలు పుష్పను వేధిస్తున్నారు. సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తున్నారు. దీంతో ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన ప్రసాద్ భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పుష్ప సోమవారం భర్త ఇంటిపై ఎదుట ఆందోళన చేపట్టింది. Also Read: పుష్పకు అండగా నిలిచిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌తో పాటు అతడి తల్లిదండ్రులు మరియదాసు, మేరీలకు కౌన్సెలింగ్ ఇచ్చి పుష్పను అత్తింట్లోకి పంపించారు. పుష్పకు ఇకపై ఏమైనా భర్తతో పాటు అత్తమామలే బాధ్యత వహించాలని వారిని హెచ్చరించారు. కోడలిని బాగా చూసుకుంటామని వారి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. Also Read:


By October 08, 2019 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maguntur-man-throwout-wife-for-family-disputes/articleshow/71487981.cms

No comments