Breaking News

తెలంగాణలో పరువు దాడి... అల్లుడిపై హత్యాయత్నం చేసిన మామ


తెలంగాణలోని జిల్లాలో కలకలం రేపుతోంది. తిర్యాణి మండలం నాయకపుగూడకు చెందిన సత్యంచారి అనే వ్యక్తి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడి చిన్న కూతురు కావ్య అదే గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతదో మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. Also Read: కొత్త దంపతులు మంచిర్యాల జిల్లాలోని సోమంగూడెంలో కాపురం పెట్టారు. దసరా పండుగ సందర్భంగా నవీన్ తల్లిదండ్రులు కొడుకు, కోడలిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సత్యంచారి ఆగ్రహంతో రగిలిపోయాడు. తన కూతురిని తీసుకుపోయి తన పరువు తీసిన నవీన్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నవీన్ ఇంటికి వెళ్లి అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. Also Read: మామను అడ్డుకునే క్రమంతో నవీన్‌కు చేతులు, పక్కటెముకలకు గాయాలయ్యాయి. నవీన్ కేకలు విన్న అతడి సోదరుడు కిరణ్ వెంటనే అక్కడికి రావడంతో సత్యంచారి పరారయ్యాడు. బాధితుడిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నవీన్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు సత్యంచారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస నమోదు చేశారు. నిందితుడి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రామారావు తెలిపారు. Also Read:


By October 15, 2019 at 10:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-defamation-attack-man-stabs-son-in-law-in-komaram-bheem-district/articleshow/71591315.cms

No comments