Breaking News

Chandrababuకు పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ.. బొత్స సంచలన ఆరోపణలు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రిర సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ రాజకీయ బినామీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ బినామీ కాబట్టే.. టీడీపీ వాయిస్‌ను పవన్ వినిపిస్తున్నారని బొత్స ఆరోపించారు. సోమవారం ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం గురించి బొత్స మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మాణాలకు సాధారణ వ్యయంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందన్న ఆయన.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తామన్న బొత్స.. రాజధానితోపాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. జగన్‌ వంద రోజుల పాలనకు 100 మార్కులు వచ్చాయన్నారు. రాజధానిని దొనకొండకు తరలిస్తారా అనే ప్రశ్నకు బొత్స బదులిస్తూ.. దొనకొండా...? అదెక్కడుందని ఎదురు ప్రశ్నించారు. ఆగష్టు 30, 31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించిన .. బొత్స గారూ జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో మీరే సీఎం కావొచ్చేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి మాయలో పడొద్దంటూ బొత్సకు జనసేనాని సూచించారు. ఆ ఫోక్స్ వ్యాగన్ కేసు ఏదో ఉందనుకుంటా అంటూ హెచ్చరించారు.


By September 09, 2019 at 11:22AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/janasena-chief-pawan-kalyan-is-political-benami-of-chandrababu-naidu-says-minister-botsa-satyanarayana/articleshow/71043772.cms

No comments