Breaking News

మీడియా సీఎం బొత్సా గారూ.. పనికిమలిన మాటలు ఆపండి: జనసేన కౌంటర్ అటాక్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ అంటూ మంత్రి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. మీడియా ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ అంటూ ఎద్దేవా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను సీఎం అనే విషయాన్ని జగన్ మర్చిపోయారని.. ప్రధానాంశాలపై స్పందించలేక ముఖం చాటేస్తున్నారని జనసేన ఎద్దేవా చేసింది. దీంతో ముఖ్యమంత్రి తానే అన్న రీతిలో మతిమరుపు మీడియా సీఎం బొత్స తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చురకలు అంటించింది. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా చూడమని నేరుగా రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే మా నాయకుడిని చంద్రబాబు రాజకీయ బినామి అని నీచపు వ్యాఖ్యలు చేస్తారా వైఎస్ఆర్సీపీ మీడియా ముఖ్యమంత్రి బొత్స గారు. అధికారంలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటానికి సిగ్గుపడాలంటూ జనసేన ఘాటుగా బదులిచ్చింది. ‘‘బొత్సా గారు మీరు పనికిమాలిన మాటలు మాట్లాడటం ఆపి ముందు రాజధానిపై మీ నాయకుడిని స్పష్టత ఇవ్వమని చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన మీ నాయకుల చేతగానితనాన్ని కనీసం అధికారపక్షంలో కూర్చున్నాక అయినా మార్చుకోమని సూచించండ’’ని మంత్రికి జనసేన ఎద్దేవా చేసింది. బొత్సపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. అధికారంలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం తగదన్నారు. రాజధాని అంశంలో జరుగుతున్న అవకతవకలపై తొలిసారి ప్రశ్నించింది, రైతుల తరపున టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది జనసేన అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని బొత్సకు హితవు పలికారు. టీడీపీని జనసేన ప్రశ్నించినప్పుడు మీ నాయకుడు రోడ్లు పట్టుకుని తిరిగారు, నేను మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీ నాయకుడు మొహం చాటేశారు. సమస్యలను ఎదుర్కోలేక తప్పించుకొని తిరిగే మీ నాయకుడు ఎవరి బినామీ? అని బొత్సను రాపాక రాపాక వరప్రసాద్ ప్రశ్నించారు.


By September 10, 2019 at 09:14AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/janasena-party-gives-strong-reply-to-minister-botsa-satyanarayana/articleshow/71058890.cms

No comments