బాలికపై అసభ్య వ్యాఖ్యలు.. 14నెలల జైలుశిక్ష
పదేళ్ల బాలికపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కటకటాలపాలైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. మహిళలను, చిన్నారులపై కామెంట్లు చేసే పోకిరీలకు చెంపపెట్టులా కోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బంజారాహిల్స్లోని ఇందిరానగర్లో నివాసముండే వెంకట్రామిరెడ్డి అడ్డాకూలీగా పనిచేస్తుంటాడు. 2013, నవంబర్ 3న ఓ అపార్ట్మెంట్లో పనిచేసేందుకు వెస్ట్ మారేడుపల్లికి వెళ్లాడు. ఆ సమయంలో తన ఫ్లాట్ ముందు క్రాకర్స్ కాలుస్తున్న పదేళ్ల బాలికపై అసభ్య వ్యాఖ్యలు చేశాడు. దీన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు రామిరెడ్డిని నిలదీయగా వారినీ దూషించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు రామిరెడ్డి నేరం చేశాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లిలోని అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు రామిరెడ్డిని దోషిగా నిర్ధారించింది. రామిరెడ్డికి 14 నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
By July 27, 2019 at 07:57AM
No comments