Breaking News

Chandrababu Naidu నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన జగన్.. కుప్పంపై కీలక నిర్ణయం


ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి . మేజర్ పంచాయతీని నగర పంచాయతీకి అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నారట. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని.. పురపాలక శాఖ ఆదేశాలు పంపిచిందట. మున్సిపాలిటీలతో పాటు ఎన్నికల నిర్వహణకు వీలుగా.. ఈ జులై నెలాఖరుకు ఈ ప్రతిపాదనలు అందించాలని కోరారట. నగర పంచాయతీలో విలీనం చేయాల్సిన గ్రామాలు, పంచాయతీల వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారుల్ని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ నెల 17న అధికారులకు ఈ ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ప్రతిపాదనలు పంపితే.. వాటిని పరిశీలించి నగర పంచాయతీగా మార్చేందుకు కసరత్తు చేయనున్నారు. కుప్పం మేజర్‌ పంచాయతీని నగర పంచాయతీగా పెంచడానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. కుప్పం నగర పంచాయతీలోకి చుట్టు పక్కల ఉన్న 8 పంచాయతీలను కలపాలని.. అలాగేగుడుపల్లె మండలంలో మరో మూడు పంచాయతీలు విలీనం చేయాల్సి ఉంటుంది. కుప్పంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 22,303 మంది ఉంటే.. కుప్పంకు చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలు విలీనం చేస్తే ఆ సంఖ్య 49,574కు చేరుతుందట. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయతీలపై ఫోకస్ పెట్టింది. కుప్పం మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలిచ్చారు. ఇటు కుప్పంను కూడా నగర పంచాయతీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.


By July 26, 2019 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-government-asks-proposals-for-upgrade-9-gram-panchayats-kuppam-also-in-list/articleshow/70391414.cms

No comments