వెన్నుపోటు రాజకీయం: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాబు
తెలుగుదేశం ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఏకంగా రాజ్యసభలో టీడీపీని బీజేపీలోకి విలీనం చేయమని కోరారు.. ఆ ప్రక్రియ కూడా పూర్తైపోయింది. విదేశాలకు వెళ్లిన సమయంలోనే.. ఈ వ్యవహారం మొత్తం జరిగిపోయింది. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఇలాంటి రాజకీయ సంక్షోభమే వచ్చింది. ఇదే ఉదాహరణ చెబుతూ.. చంద్రబాబును టార్గెట్ చేశారు దర్శకుడు . వర్మ తన ట్వీట్లో ‘చరిత్ర దానంతట అదే పునరావృతమవుతుంది. ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్న సమయంలో.. నాదెండ్ల భాస్కర్ ఎలాగైతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారో.. అలాగే చంద్రబాబు కూడా విదేశాల్లో ఉన్న సమయంలో.. టీడీపీ నేతలు అలాగే బాబుకు వెన్నుపోటు పొడిచారని’వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వర్మ మరో ట్వీట్లో‘అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారు’ అంటూ సెటైర్ పేల్చారు.
By June 21, 2019 at 01:30PM
No comments