విజయసాయితో బీజేపీ(టీడీపీ) ఎంపీలు డిన్నర్ మీట్.. ఫోటో వైరల్
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు అఫిషియల్గా బీజేపీకి సొంతమైపోయారు. విలీన ప్రక్రియ పూర్తి కావడంతో.. ఈ నలుగురు రాజ్యసభలో బీజేపీ సభ్యులుగా గుర్తించారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్రావులు శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్టీలో చేరిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ వైరల్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీ మారిన ఎంపీలతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు కలిసి భోజనం చేసే ఫోటో బయటపడింది. వైసీపీ నేతతో ఈ ఎంపీలు కలిసి భోజనం చేయడంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఎంపీలు పార్టీ మారడం వెనుక విజయసాయి హస్తం ఉందా అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం రాజకీయమంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఫోటో పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ ఢిల్లీలో విందు ఇచ్చారట. ఆ విందుకు హాజరైన సమయంలో.. విజయసాయితో కలిసి నలుగురు ఎంపీలు భోజనం చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఫోటో వ్యవహారంపై అటు విజయసాయిరెడ్డి కాని.. నలుగురు ఎంపీలు కానీ స్పందించ లేదు. వారు స్పందిస్తే ఈ ఫోటో వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుంది.
By June 21, 2019 at 02:04PM
No comments