Breaking News

‘ఒక్కరు వెళ్లిపోతే 100 మందిని తయారుచేసే సత్తా టీడీపీకి ఉంది’


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి గురువారం చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాలు ఆ పార్టీని కుదిపేశాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. విదేశీ పర్యటనలో ఉండగా, జంపింగ్ జలానీలు మొదలయ్యాయి. కాగా, పార్టీ వీడిన ఎంపీలపై నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన నేతలు, ఇప్పుడు పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. టీడీపీ పెట్టిన భిక్షతో ప్రభుత్వాలు నడిచిన చరిత్ర కూడా ఉందని పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘2004లో అధికారం కోల్పోయాం.. పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు నాకంటే మీకే బాగా తెలుసు... కొందరు నాయకులను హత్య చేయడం.. కొందరిని బెదిరించి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. పదేళ్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడ్డాం... 2014 లో మళ్ళీ టీడీపీ అవసరం ఉందని గ్రహించి ప్రజలు మన పార్టీకి అధికారం ఇచ్చారు.. మన నాయకుడు రాష్ట్రంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం. చంద్రబాబు నాయకత్వంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. సంక్షేమం, అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా అమలు చేసి తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేశారు. 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయాం.. రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే, ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు పార్టీని వీడిపోయారు. వారు వేరే వేరే పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. మన పార్టీ నుంచి వెళ్ళిన తమ్మినేని సీతారాం నేడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్నారు. మన పార్టీ నుంచి వెళ్లి వ్యక్తి కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్నారు.. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. 2014 నుంచి 2018 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిందంటే మన పార్టీ నుంచి వెళ్లిన నేతల పాత్ర కీలకం.. ఎంత మంది పార్టీని వీడినా సరే మనం ఎన్నడూ కుంగిపోలేదు.. కొత్త నాయకులను తయారు చేసుకున్నాం.. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాం. మన పార్టీ పెట్టిన భిక్షతో ప్రభుత్వాలు నడిచిన చరిత్ర కూడా మీకు తెలుసు. ఒక నాయకుడు వెళ్తే వంద మందిని తయారు చేసుకునే శక్తి మనకు ఉంది. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అన్నారు... కాని మీరే చూశారు మొన్న ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు వెళ్తే ఎంత మంది పసుపు జెండా పట్టుకుని నిలబడ్డారో.. మన పార్టీ రాష్ట్రానికి, ప్రతీ తెలుగువాడికి భవిష్యత్తు చూపించిన పార్టీ.. ఇలాంటి సంక్షోభాలు, కుట్రలు మనకి కొత్త కాదు... ఇలాంటివి పార్టీ ఎన్నో చూసింది. నేను పార్టీకి అండగా ఉంటున్నాను... మీరు నాతో వస్తున్నారని నేను భావిస్తున్నాను’అని అవినాశ్ ఉద్ఘాటించారు.


By June 21, 2019 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telugu-yuvatha-president-devineni-avinash-open-letter-to-tdp-followers/articleshow/69888090.cms

No comments