Breaking News

వివస్త్రను చేసి అత్యాచారం.. రేప్ చేసినవారికి లక్ష జరిమానా విధించిన గ్రామ పెద్దలు


ఒక యువతిని ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. వివస్త్రను చేసి వీడియో కూడా తీశారు. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెడితే.. విచారించిన పెద్దలు ఎవరికీ అన్యాయం జరగకుండా తీర్పు చెప్పారు. రేప్ చేసినందుకుగాను ఇద్దరు యువకులకు కలిపి లక్ష రూపాయల జరిమానా విధించారు. పెద్దల పంచాయతీలో కూడా తనకు న్యాయం జరగకపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈనెల 18వ తేదీన పొలంలో ఆవులను మేపుతున్న యువతి పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె పెనుగులాడటంతో అతడు మరొకరికి ఫోన్ చేసి రప్పించాడు. ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె బట్టలు విప్పేసి వీడియో తీశారు. దీనిపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేస్తే నిందితులు ఇద్దరికీ లక్ష రూపాయల జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. మొత్తానికి ధైర్యం చేసిన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం గుర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయనగరం గ్రామీణ పోలీసులు గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిజానిజాలు తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


By June 25, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-teenagers-raped-young-woman-in-vizianagaram-district/articleshow/69937634.cms

No comments