ఏడాది బిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిసి చలించిపోయిన ముఖ్యమంత్రి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
వేదికపై ముఖ్యమంత్రి.. మంత్రులు కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి తనచేతిలో ఉన్న చంటి బిడ్డను వైదికపైకి విసిరేశాడు. ఈ అనూహ్య సంఘటనతో అక్కడున్న వారు షాకయ్యారు. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకే అతడు అలా చేసినా.. ఆ కన్నతండ్రి చర్య వెనుక గల కారణం తెలిసి సీఎం సహా అందరూ చలించిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో సాగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లా కెస్లీ తాలూకా షహాజ్పూర్ గ్రామానికి చెందిన ముకేశ్ పటేల్, నేహ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ముకేశ్ దినసరి కూలీ కావడం వల్ల రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.
By May 17, 2023 at 08:04AM
By May 17, 2023 at 08:04AM
No comments