నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి.. భయంతో వణికిన జనం
నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని మొసలి లాక్కెళ్లడంతో సమీపంలో ఉన్నవాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది. బాధితుడు బతికున్నాడా? లేదా? ఇంకా తెలియాల్సి ఉంది. అతడు ప్రాణాలతో ఉండటం దాదాపు అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా దిగింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.
By May 19, 2022 at 07:02AM
By May 19, 2022 at 07:02AM
No comments