Breaking News

బెంగళూరుకు నవీన్ శేఖరప్ప మృతదేహం.. పరిశోధనల కోసం ఆస్పత్రికి అప్పగింత


ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మార్చి ఒకటో తేదీన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందాడు. ఆహారం కోసం బయటకు వెళ్లి క్యూలో నిల్చున్న సమయంలో రష్యా బాంబు దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 20 రోజుల తర్వాత ఆయన మృతదేహం సోమవారం ఉదయం బెంగళూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నవీన్ కుటుంబసభ్యులు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా ప్రభుత్వ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని, పార్దీవదేహానికి నివాళులర్పించారు.

By March 21, 2022 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/body-of-naveen-shekarappa-killed-in-ukraine-reaches-karnataka-and-cm-pays-respect/articleshow/90345585.cms

No comments