Breaking News

నేడు తుఫానుగా బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్


ఈ ఏడాదిలో ఏర్పడుతున్న తొలి తుఫానుకు అసనిగా నామకరణం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని, మరికొన్ని గంటల్లో తుఫాను రూపాంతరం చెందుతుందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం సాయంత్రానికి తుఫాను మారనున్న ఈ అల్పపీడనం.. రాబోయే 48 గంటల్లో అండమాన్, మయన్మార్, దక్షిణ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతుందని అంచనా వేసింది. అండమాన్ దీవులకు ఐఎండీ ఎల్లో హెచ్చిరికలు జారీచేసింది. తుఫాను ముప్పు పొంచి ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో అండమాన్, నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమయ్యింది.

By March 21, 2022 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/depression-over-north-andaman-in-bay-of-bengal-intensified-into-cyclone/articleshow/90344952.cms

No comments