Breaking News

యూపీలో మొదలైన చివరి దశ పోలింగ్.. అందరి దృష్టి ఆ స్థానంపైనే


దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. తుది విడత పోలింగ్‌ సోమవారం ఉదయం మొదలయ్యింది. ఈ దశలో 54 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 613 మంది అభ్యర్థులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే, 2కోట్ల 6లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు ఇందులో ఉన్నాయి. తన నియోజకవర్గం పరిధిలోని మూడు చోట్ల ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారణాసి, పొరుగు జిల్లాల్లో మోడీ విస్తృతంగా పర్యటించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌, ప్రియాంక గాంధీలు నాలుగు రోజుల పాటు ప్రచారం చేశారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఎస్పీ తరఫున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన నాయకులంతా కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మాత్రం ఎవరికీ ఎలాంటి ప్రత్యేక పూజలు చేయలేదు. సాధారణ భక్తుల్లాగానే పరిగణించారు. ఈ దశలో రాష్ట్ర మంత్రులు నీలకంఠ తివారీ (వారణాసి దక్షిణ), అనిల్‌ రాజ్‌భర్‌ (శివ్‌పుర్‌-వారణాసి), రవీంద్ర జయస్వాల్‌ (వారణాసి ఉత్తర), గిరీశ్‌ యాదవ్‌ (జౌన్‌పుర్‌), రామశంకర్‌సింగ్‌ పటేల్‌ (మడిహాన్‌-మిర్జాపుర్‌)లతో పాటు ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన దారాసింగ్‌ చౌహాన్‌ (ఘోసీ), సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ (జహూరాబాద్‌) తదితర ప్రముఖులు ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో , దాని మిత్రపక్షాలు 36 చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ 11, బహుజన సమాజ్‌ పార్టీ 6 సీట్లలో విజయం సాధించాయి. ఈ దశ పోలింగ్‌తో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. యూపీలోని మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ నెల 10న యూపీతో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులనే కాదు.. ఈ ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్నుకోడానికి అధికార పార్టీ ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ.. యూపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతా దళ్‌ (బీజేడీ) రాష్ట్రపతి ఎన్నికలో కీలకం కానున్నాయి.


By March 07, 2022 at 07:44AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/uttar-pradesh/news/voting-for-final-phase-of-uttar-pradesh-elections-begins-all-eyes-on-varanasi/articleshow/90041316.cms

No comments