Breaking News

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పదస్థితిలో మృతి.. ఎంబసీలో అంతా మిస్టరీ?


ముకుల్‌ ఆర్య అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రమల్లాలోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడి ఉన్నారు. ముకుల్‌ ఆర్య మరణ వార్తను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ ధ్రువీకరించారు. ఆయన మృతిపై జయ్‌శంకర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. అతను ఎంతో తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి. ముకుల్‌ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి’’ అని జయ్‌శంకర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత రాయబారి ముకుల్‌ ఆర్య మృతిపై అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది తీవ్ర ఆశ్చర్యం, షాకింగ్‌ వార్త అని పేర్కొంది. ‘‘ఈ దిగ్భ్రాంతికరమైన వార్త తెలిసిన వెంటనే ఆర్య నివాస ఉండే ప్రాంతానికి వెళ్లాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టాయే నుంచి ఆరోగ్య, ఫోరెన్సిక్ మెడిసిన్ మంత్రిత్వ శాఖతో పాటు అన్ని భద్రత, పోలీసు, ప్రభుత్వ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నిరకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముకుల్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ముకుల్‌ మరణం పట్ల పాలస్తీనా విదేశాంగశాఖ మంత్రి రియాద్‌ అల్‌ మాలికీ భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌కు, భారత ప్రభుత్వానికి, ఆర్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్‌ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై కాబూల్‌, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో,ఢిదిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో సైతం పనిచేశారు.


By March 07, 2022 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mukul-arya-indias-envoy-of-palestine-found-dead-at-indian-mission-in-ramallah/articleshow/90041666.cms

No comments