Breaking News

పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీల దుమ్ముదులిపిన ‘చీపురు’


1966లో పంజాబ్ ఏర్పడిన తర్వాత ప్రధానంగా అక్కడ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), మధ్య అధికారం మారుతూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లోనూ ముఖాముఖ లేదా త్రిముఖ పోరు కనిపించేది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన చేస్తున్న కాంగ్రెస్, అకాలీలకు షాకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను తనకు అనుకూలంగా మలచుకున్న .. 80కిపైగా స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది. 2017 ఎన్నికల్లో గెలుపు ముంగిట చతికిలబడి ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఆప్ 20 సీట్లను గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అధికార పీఠాన్ని అందుకోలేకపోయిన ఆప్.. లోపాలను సరిదిద్దుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. 2017లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కేజ్రీవాలే సీఎంగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని చర్చ జరిగింది. ఇది కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశమైంది. అలాగే, ఖలిస్థాన్ వేర్పాటువాదలను కలిసి మద్ధతు కోరినట్టు కేజ్రీవాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో పంజాబ్ ప్రజల కళ్ల ముందు వేర్పాటువాద, ఉగ్రవాద చీకటి రోజులు మెదిలాయి. ఈ రెండు తప్పిదాలు చేయకపోయి ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఆనాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని చెబుతుంటారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో అందరి కంటే ముందే ఆప్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ప్రజాభిప్రాయం సేకరణ ద్వారా భగవంత్ మాన్‌ను ఎంపిక చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా కొనసాగినా.. పంజాబ్‌లో ఆప్ 4 స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆప్‌ ప్రచారానికి దోహదపడ్డ ‘‘డ్రగ్స్‌కి కాదు, మద్యానికి కాదు, చీపురుకే ఓటు వేద్దాం’’ వంటి నినాదాలను పార్టీ మళ్లీ ఎత్తుకుంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఓటర్లను ఆలోచనలో పడేసింది.


By March 10, 2022 at 11:50AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/punjab/news/aap-landslide-victory-in-punjab-assembly-elections/articleshow/90119311.cms

No comments