Breaking News

రష్యా చమురులో ఉక్రెయిన్ రక్తపు వాసన తెలియడం లేదా..? : డిమిట్రో కులేబా


రష్యా చమురును కొనవద్దని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కోరారు. రష్యా చమురులో ఉక్రెయిన్ ప్రజల రక్తపు వాసన ఉందని అన్నారు. షెల్ ప్రతినిధి శుక్రవారం రష్యన్ ముడి చమురు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ముడి చమురును కొనుగోలు చేయడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. దీంతో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా విమర్శలు గుప్పించారు. రష్యా ఆయిల్ కొనుగోలుపై సీరియస్ అయ్యారు. ఒక టెలివిజన్ ప్రసంగంలో డిమిట్రో కులేబా ఆదివారం మాట్లాడారు. ఈ సందర్భంగా "రష్యాతో అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని బహుళజాతి కంపెనీలను డిమాండ్ చేయాలని నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి పిలుపునిస్తున్నాను." అని అన్నారు. ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపాలని, రష్యాపై ఒత్తిడిని పెంచాలని డిమిట్రో కులేబా అన్నారు. "ఈ యుద్ధంలో రష్యా గెలవదు.. రష్యన్లను రక్షించడానికి, ఈ రక్తపాతాన్ని అంతం చేయడానికి ఇది సమయం" అని ఆయన అన్నారు. అలాగే నో ఫ్లై జోన్‌ను ప్రకటించమని కోరుతున్నాం. ఉక్రెయిన్‌లో విచక్షణా రహిత బాంబు దాడులను ఆపాల్సిన అవసరం ఉందని డిమిట్రో అన్నారు. యుద్ధ విమానాలపై నియంత్రణ పెట్టడంతో పాటు, క్షిపణి రక్షణ ఆయుధాలను అందించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ రక్తపు వాసన వస్తున్న రష్యా చమురును కొనడమంటే, రష్యా యుద్ధ నేరాలకు ఆర్థిక వనరులను సమకూర్చడమేనని ఆరోపించారు. అదే సమయంలో యూరోపియన్ నౌకాశ్రయాలకు రష్యన్ నౌకలను అనుమతించరాదని, క్రిప్టోకరెన్సీకి రష్యాకు యాక్సెస్ ఇవ్వకూడదని డిమిట్రో కులేబా విజ్ఞప్తి చేశారు.


By March 06, 2022 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/minister-dmytro-kuleba-asks-does-not-russian-oil-smell-of-ukrainian-blood/articleshow/90028486.cms

No comments