Breaking News

ముంచుకొస్తున్న మరో ముప్పు.. రెండు రోజుల్లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు


దేశంలో కరోనా కేసులు పెరుగుదల రెండు రోజుల్లోనే రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం కంటే బుధవారం 44 శాతం మేర కేసులు పెరిగితే.. గురువారం మరింత పెరిగింది. బుధవారం రాత్రి వరకూ దేశవ్యాప్తంగా 13,155 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజుతో పోల్చితే 47 శాతం అధికం. మంగళవారం 6,242 కేసులు నమోదుకాగా.. బుధవారం 9,155 మందికి కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. రోజువారీ కరోనా కేసుల్లో రెండు రోజుల నుంచి పెరుగుదల 40 శాతానికిపైగా ఉంది. దేశంలో తీవ్ర ప్రభావం చూపిన కరోనా రెండో వేవ్‌లోనూ రోజువారీ కేసుల వృద్ధి రేటు ఇంతగా లేదు. మార్చి 31 అత్యధికంగా 35 శాతం, ఏప్రిల్ 1 13.5 శాతం మేర పెరిగాయి. గతవారం వరకూ దేశంలో తక్కువ సంఖ్యలో నమోదయిన కరోనా కేసులు.. ఒక్కసారిగా పెరగడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రాలు మినహా కనీసం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో మంగళవారం 21,72 కేసులు నమోదుకాగా.. బుధవారం ఆ సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. ఏకంగా 3,900 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్కడ 110 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఒక్క ముంబయిలోనే 2,445 మందికి కొత్త వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇటీవల నెలల్లో దేశంలోని ఏ పెద్ద నగరంలో ఈ సంఖ్యలో నిర్ధారణ కాలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మంగళవారం 496 కేసులు బయటపడగా.. బుధవారం ఆ సంఖ్య 923కి చేరింది. బెంగాల్ (1,089), కర్ణాటక (566), గుజరాత్ (548), ఝార్ఖండ్ (344), హరియాణా (217)లోనూ రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, బిహార్, పంజాబ్, గోవాలోనూ కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో కొత్త వేరియంట్ సైతం 1,000 మార్క్‌ను వేగంగా దాటేశాయి.


By December 30, 2021 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reported-over-13000-fresh-covid-cases-and-double-at-record-pace/articleshow/88580621.cms

No comments