Breaking News

Maharashtra కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం


మహరాష్ట్రలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మద్‌నగర్ జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో సంభవించిన ఈ ప్రమాదంలో ఆరుగురు రోగులు సజీవదహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By November 06, 2021 at 12:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-killed-after-fire-break-out-at-ahmednagar-district-covid-hospital-in-maharashtra/articleshow/87551172.cms

No comments