Breaking News

భారత్‌‌తో ప్రతిష్ఠంభన.. సరిహద్దులకు సంబంధించి చైనా సంచలన చట్టం!


సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. డ్రాగన్ భూసరిహద్దు రక్షణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. చైనా సార్వభౌమాధికారం.. ప్రాదేశిక సమగ్రత ‘పవిత్రమైనవి, ఉల్లంఘించలేనివి’అని పేర్కొంటూ ఆ దేశ జాతీయ అసెంబ్లీ భూ సరిహద్దుల రక్షణ, దోపిడీపై కొత్త చట్టాన్ని ఆమోదించింది. తాజా చట్టం భారత్, చైనా సరిహద్దు వివాదంపై ప్రభావం చూపుతుంది. ఆమోదం పొందిన ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పవిత్రమైంది.. ఉల్లంఘించదగినది’ అని ఈ చట్టం నిర్దేశిస్తుంది. కాగా, తాజా భూసరిహద్దు చట్టం వల్ల భద్రతలో మార్పులు లేకపోయినా.. తన సరిహద్దులను నిర్వహించగల సామర్థ్యంపై చైనాకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రాదేశిక సమగ్రత, భూ సరిహద్దులను కాపాడటానికి, వాటిని అణగదొక్కేలా ఎవరైనా చర్యకు దిగితే పోరాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నివేదిక పేర్కొంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సైనికులు, పోలీసులు ఏదైనా దండయాత్ర, ఆక్రమణ, చొరబాటు, రెచ్చగొట్టడం నుంచి సరిహద్దును రక్షించే బాధ్యతలను ఈ చట్టం కట్టబెడుతుంది. సమీపంలోని యుద్ధం లేదా ఇతర సాయుధ పోరాటం సరిహద్దు భద్రతకు ముప్పు కలిగిస్తే చైనా తన సరిహద్దును మూసివేయవచ్చని చట్టం నిర్దేశిస్తుంది. ‘సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపుల సూత్రాన్ని అనుసరించి, వివాదాలు, దీర్ఘకాల సరిహద్దు సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి చర్చల ద్వారా పొరుగు దేశాలతో భూ సరిహద్దు సంబంధిత వ్యవహారాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది’ అని తెలిపింది. చైనా సైన్యం కవాతులు నిర్వహించడం, దండయాత్ర, ఆక్రమణ, రెచ్చగొట్టడం వంటి ఇతర చర్యలను నిరోధించడం, ఎదుర్కొవడం సహా సరిహద్దు విధులను నిర్వహిస్తుంది అని పేర్కొంది. ఈ కొత్త చట్టంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సరిహద్దు పట్టణాల నిర్మాణానికి ప్రభుత్వ మద్దతు, వాటి పనితీరును మెరుగుపరచడం, నిర్మాణానికి సహాయక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యులు శనివారం జరిగిన అసెంబ్లీ ముగింపు సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదించినట్లు చైనా అధికారిక పత్రిక జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడానికి, ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడంతోపాటు అక్కడ ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజల జీవనోపాధిని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలని చట్టం నిర్దేశించింది.


By October 25, 2021 at 06:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/amid-military-standoff-with-india-china-passes-new-land-border-law/articleshow/87246567.cms

No comments