Breaking News

కేవలం దాని కోసమే పోరాడు.. సమంతకు అమ్మ చెప్పిన మాట! వైరల్ అవుతున్న సందేశం


కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ సమంత. ఎప్పుడైతే ఆమె విడాకుల ప్రస్తావన తెరపైకి వచ్చిందో అప్పటినుంచి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. చివరకు నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని సమంతనే స్వయంగా బయటపెట్టడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. చై- సామ్ విడిపోతున్నారనే అధికారిక స్టేట్‌మెంట్ అక్టోబర్ 2వ ఇవ్వగా.. నేటికీ జనం ఆ మాట నమ్మలేకపొతున్నారు. మరోవైపు మాత్రం తన విడాకుల తాలూకు బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ దేశాన్ని చుట్టి వస్తోంది. విడాకుల ప్రకటన అనంతరం తనపై జరిగిన ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ తిప్పికొట్టిన సమంత.. వీలు కుదిరినప్పుడల్లా అదే సోషల్ మీడియాలో మోటివేషనల్ సందేశాలు పోస్ట్ చేస్తోంది. వీటిని అర్థం చేసుకుంటే అందులో ఎన్నో విషయాలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మై మమ్మా సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‍తో ఓ సందేశం ఇచ్చింది సామ్. ''మీరిప్పుడు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి'' అని పేర్కొంటూ దానిపై మా అమ్మ చెప్పింది అనే ట్యాగ్ ఇచ్చేసింది సామ్. దీంతో ఈ సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే కొన్ని రోజులుగా సమంత తన స్నేహితురాలు, డిజైనర్ శిల్పా రెడ్డితో టూర్ ఎంజాయ్ చేస్తోంది. అందమైన ప్రదేశాలు చుట్టిరావడంతో పాటు ఆధ్యాత్మిక లోకాన్ని కూడా టచ్ చేస్తోంది. ఇటీవలే ఛార్ ధామ్ యాత్ర ముగించుకున్న సమంత.. తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది. ఈ యాత్ర ఎంతో అద్భుతంగా జరిగిందని చెబుతూ యాత్రా విశేషాలను, అక్కడ దిగిన ఫొటోలను పంచుకుంది. విడాకుల అనంతరం తన పూర్తి ఎఫర్ట్ సినిమాపైనే పెట్టాలని చూస్తోందట సమంత. ఇకపై కెరీర్ పరంగా మరింత దూసుకుపోవాలని ప్లాన్స్ చేస్తోందట. ఈ మేరకు ఇప్పటికే 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆమె.. ఇటీవల మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


By October 25, 2021 at 06:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/my-momma-said-samantha-latest-post-viral-on-social-media/articleshow/87246752.cms

No comments