బ్రిటన్కు దిమ్మదిరిగే షాక్.. భారత్ వచ్చే ఆ దేశస్థులకు 10 రోజుల క్వారంటైన్..!
భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదని యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్లో ఉండాలన్న యూకే నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని తీవ్రంగా ఖండించి భారత్.. అవి వివక్షాపూరితమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గకపోతే తామూ దీటుగానే స్పందిస్తామని హెచ్చరించింది. అయినా సరే యూకే స్పందిచడం లేదు. దీంతో భారత్ కూడా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షల విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చేవారికి 10 రోజులు క్వారంటైన్, మూడుసార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయనుంది. అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లో రానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 4 నుంచి భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు మూడు ఆర్టీ పీసీఆర్ రిపోర్టులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్కు చేరుకున్న తర్వాత హోం/ హోటల్లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులకు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోఎన్టెక్, మోడెర్నాలతో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను మాత్రమే గుర్తిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. భారత్లో తయారయ్యే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కొవిషీల్డ్ను గుర్తించడం లేదని నిబంధనల్లో పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాక్సిన్ పొందిన భారతీయులను టీకా తీసుకోనట్లుగా పరిగణిస్తూ యూకే ప్రభుత్వం కొవిడ్ ప్రయాణ నిబంధనల్లో పేర్కొంది. అక్టోబరు 4 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్ నిర్ణయం వివక్షాపూరితమని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
By October 02, 2021 at 07:50AM
No comments