Breaking News

జాయ్ అంటూ ఆ పని చేసిన యంగ్ హీరోయిన్.. నివేదాను అలా చూసి షాకవుతున్న ఫ్యాన్స్


సినీ తరాలది విలాసవంతమైన జీవితం.. వాళ్ళకేంటి లగ్జరీ కార్లు, చేతికి మట్టి అంటని జీవితం అనుకుంటారు జనం. అందులో ఎంతో కొంత వాస్తవం ఉన్నా కూడా లైఫ్ లీడ్ చేయడంలో ఎవరి కష్టాలు వాళ్లవి అనేది మాత్రం నిజం. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. కాగా తాజాగా యంగ్ హీరోయిన్ సాధారణ రైతు అవతారమెత్తి షాకిచ్చింది. ఓ డైరీ ఫామ్‌కి వెళ్లిన ఆమె అక్కడ సరదాగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. డైరీ ఫామ్‌కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. దీంతో దీనిపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఆవు పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు గ్రేట్ అక్కా అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఓ హీరోయిన్ ఇలా ఆవు పాలు పితకడం చూపరులకు కాస్త వెరైటీగా అనిపిస్తుండటంతో ఈ వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. బాలనటిగా కెమెరా ముందుకొచ్చిన నివేదా థామస్ పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి తెలుగులో 'జెంటిల్ మెన్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తనదైన క్యూ లుక్స్‌లో అన్ని వర్గాల ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసి ఆ తర్వాత ''నిన్నుకోరి, జై లవకుశ'' లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నివేద చేతిలో తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి.


By September 08, 2021 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nivetha-thomas-shared-shocking-video-in-her-social-media-account/articleshow/86028020.cms

No comments